మైలవరంలో 133 కు చేరిన కరోనా బాధితులు

ABN , First Publish Date - 2020-06-29T10:22:39+05:30 IST

మండల పరిధిలో 133 మంది కరోనా భారీన పడ్డారు. చిన్నకొమెర్ల గ్రామంలో ఆదివారం మరో నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు

మైలవరంలో 133 కు చేరిన కరోనా బాధితులు

మైలవరం, జూన్‌ 28 : మండల పరిధిలో 133 మంది కరోనా భారీన పడ్డారు.  చిన్నకొమెర్ల గ్రామంలో ఆదివారం మరో నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మైలవరం వైద్యాధికారి అజరయ్య తెలిపారు. శనివారం చిన్నకొమెర్లలో 8మందికి కరోనా సోకగా ఆదివారం మరో నలుగురికి రావడంతోబాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మండలంలో ఇప్పటికి నవాబుపేటలో 102 మందికి, చిన్నకొమెర్ల  గ్రామంలో 31 మంది కరోనా భారీన పడ్డారు. 


నిబంధనలు పాటించకుంటే చర్యలు

కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని తలమంచిప ట్నం, మైలవరం ఎస్‌ఐలు ధనుంజయుడు, ప్రవీణ్‌కుమార్‌లు హెచ్చరించారు. కరోనా వచ్చిన గ్రామాల్లో ఆదివారం వారు పర్యటించి ప్రజలకు కరోనా నియ మ నిబంధనలను పాటించాలని సూచించారు.

Updated Date - 2020-06-29T10:22:39+05:30 IST