కరోనా బాధిత టైలర్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-09-22T11:23:46+05:30 IST
కరోనాతో మనస్తాపానికి గురైన 39 ఏళ్ల ఓ టైలర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతనికి పాజిటివ్ నిర్ధారణ
ఆకివీడు, సెప్టెంబరు 21 :కరోనాతో మనస్తాపానికి గురైన 39 ఏళ్ల ఓ టైలర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతనికి పాజిటివ్ నిర్ధారణ కావ డంతో హోం క్వారంటైన్లో ఉండాలని ఏఎన్ఎం మందులు, కిట్ అందజేశారు.
సోమవారం అతని భార్య రొయ్యల కంపెనీలో పనికి వెళ్లగా.. పిల్లలు తమ తాతగారింటికి వెళ్లారు. మధ్యాహ్నం వరకు కుట్టుమిషన్ కుట్టి ఇంటికి వచ్చి భోజనం చేసి ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతి చెందాడు..