హెచ్పీ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో కరోనా వెంటిలేటర్ విడి భాగాల తయారీ
ABN , First Publish Date - 2020-06-05T08:21:44+05:30 IST
కొవిడ్-19 రోగులకు వినియోగించే వెంటిలేటర్లకు అవసరమైన విడిభాగాల తయారీ కోసం త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని హెచ్ పీ అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా అగ్వా హెల్త్కేర్కు అవసరమైన 1.2లక్షల వెంటిలేటర్ విడిభాగాల ఉత్పత్తికి రెడింగ్టన్ త్రీడీతో చేతులు కలిపింది...
న్యూఢిల్లీ, జూన్ 4: కొవిడ్-19 రోగులకు వినియోగించే వెంటిలేటర్లకు అవసరమైన విడిభాగాల తయారీ కోసం త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని హెచ్ పీ అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా అగ్వా హెల్త్కేర్కు అవసరమైన 1.2లక్షల వెంటిలేటర్ విడిభాగాల ఉత్పత్తికి రెడింగ్టన్ త్రీడీతో చేతులు కలిపింది. ఇందులో భాగంగా 10,000 వెంటిలేటర్ల తయారీ కోసం 12 కేటగిరీల్లో విడిభాగాలను త్రీడీ ప్రింటింగ్ చేశారు. వీటిని రోగుల చికిత్స కోసం దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. సంప్రదాయ పద్ధతిలో వీటిని తయారు చేయాలంటే కనీసం 4-5 నెలలు పట్టేది. హెచ్పీ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో 24 రోజుల్లోనే ప్రింట్ చేసినట్టు కంపెనీ తెలిపింది.