ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో 100 శాతం వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం ఏర్పాట్లు!

ABN , First Publish Date - 2021-09-18T14:33:25+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా...

ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో 100 శాతం వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం ఏర్పాట్లు!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా దేశంలో కరోనా వ్యాక్సినేషన్ రికార్డులు బద్దలు కొట్టింది. దేశంలో తొలిసారిగా ఒక్కరోజులో 2.5 కోట్ల మందికి టీకాలు వేశారు. ఇదే తీరు మున్ముందు కొనసాగితే అక్టోబరు మొదటి వారానికే 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో వీలైనంత వేగంగా 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలలో వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయనున్నారు. ఇదేవిధంగా కేసులు పెరుగుతున్న కేరళ, కర్నాటకలలో కూడా వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయనున్నారు. 

Updated Date - 2021-09-18T14:33:25+05:30 IST