కరోనా వ్యాక్సిన్ కేంద్రాలు కిటకిట
ABN , First Publish Date - 2021-05-09T05:06:57+05:30 IST
కరోనా వ్యాక్సిన్ కేంద్రాలకు జనాలు భారీగా తరలివస్తుండడంతో వారిని నియంత్రించేందుకు వైద్య సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు.
గాజువాక, మే 8 : కరోనా వ్యాక్సిన్ కేంద్రాలకు జనాలు భారీగా తరలివస్తుండడంతో వారిని నియంత్రించేందుకు వైద్య సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు. కేవలం సెకండ్ డోస్ వ్యాక్సిన్ మాత్రమే వేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ వినిపించుకోకుండా ఉదయం నుంచే కేంద్రాల వద్దకు ప్రజలు తరలివస్తున్నారు. ఇదే పరిస్థితి దాదాపు అన్ని కేంద్రాలలో తలెత్తుతున్నది. ఒకేసారి భారీగా జనాలువస్తే వ్యాక్సిన్ వేయలేకపోతున్నారని గాజువాక పీహెచ్సీ వైద్యాధికారి రామకృష్ణ స్పష్టం చేశారు. ఇప్పటివరకు గాజువాక జోన్లో 15 వేల మందికి పైగా వ్యక్తులకు సెకండ్ డోస్ వేసినట్టు తెలిపారు. సెంకడ్ డోస్ పూర్తయిన తరువాతే పస్ట్ డోస్ ప్రారంభమవుతుందని, అంతవరకు ప్రజలు సహకరించాలని కోరారు.