వ్యాక్సినేషన్ సెంటర్‌లో తోపులాట... లాఠీ ఛార్జ్... పారిపోయిన ఆరోగ్య కార్యకర్తలు!

ABN , First Publish Date - 2021-07-14T16:17:07+05:30 IST

బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో వ్యాక్సిన్ వేయించుకునేందుకు...

వ్యాక్సినేషన్ సెంటర్‌లో తోపులాట... లాఠీ ఛార్జ్... పారిపోయిన ఆరోగ్య కార్యకర్తలు!

గోపాల్‌గంజ్: బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో వ్యాక్సిన్ వేయించుకునేందుకు అంబేద్కర్ భవన్‌కు లెక్కుకుమించి జనం రావడంతో, సోషల్ డిస్టెన్సింగ్ అన్నదే ఎక్కడా కనిపించలేదు. ఒకరినొకరు తోసుకుంటూ వ్యాక్సిన్ కోసం ఎగబడ్డారు. దీనిని చూసిన ఆరోగ్య కార్యకర్తలు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గుంపును చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జీ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన కొందరు యువకులు అక్కడి కుర్చీలను విసిరికొట్టారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా 60 ఏళ్ల రైతు స్వామినాథన్ మాట్లాడుతూ వ్యాక్సిన్ వేయించుకునేందుకు కొద్ది రోజులుగా ఈ సెంటర్‌కు చాలామంది వస్తున్నారని, అయితే వ్యాక్సిన్ కొరత కారణంగా అందరికీ అందడం లేదని తెలిపారు.

Updated Date - 2021-07-14T16:17:07+05:30 IST