భారత్‌లో కరోనాకు సంబంధించి కేంద్రం చెప్పిన కొత్త లెక్కలివి..

ABN , First Publish Date - 2020-04-10T21:57:29+05:30 IST

భారత్‌లో కరోనా ప్రభావానికి సంబంధించి శుక్రవారం నాటి హెల్త్ బులిటెన్‌ను కేంద్రం విడుదల...

భారత్‌లో కరోనాకు సంబంధించి కేంద్రం చెప్పిన కొత్త లెక్కలివి..

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ప్రభావానికి సంబంధించి శుక్రవారం నాటి హెల్త్ బులిటెన్‌ను కేంద్రం విడుదల చేసింది. గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 678 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దీంతో.. భారత్‌లో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,412కు చేరినట్లు ఆయన పేర్కొన్నారు. 503 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపారు.


గడచిన 24 గంటల్లో కరోనా బారిన పడి దేశవ్యాప్తంగా 33 మంది మరణించినట్లు పేర్కొన్నారు. భారత్‌లో ఇప్పటివరకూ 199 మంది కరోనా మహమ్మారి మూలాన ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన వెల్లడించారు. 67 ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 3.28 కోట్ల హైడ్రోక్లోరోక్విన్ ట్యాబ్లెట్స్ భారత్‌లో అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు.  

Updated Date - 2020-04-10T21:57:29+05:30 IST