పాక్‌ జట్టులో మరో ముగ్గురికి కరోనా

ABN , First Publish Date - 2020-12-02T09:07:30+05:30 IST

కొవిడ్‌-19 నిబంధనలను తేలికగా తీసుకున్నందుకు పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు తగిన మూల్యం చెల్లిస్తోంది. సోమవారం మరో ముగ్గురు ఆటగాళ్లకు కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలడంతో ఇప్పటివరకు కొవిడ్‌ బారిన పడిన పాక్‌ క్రికెటర్ల సంఖ్య పదికి చేరింది.

పాక్‌ జట్టులో మరో ముగ్గురికి కరోనా

క్రైస్ట్‌చర్చ్‌: కొవిడ్‌-19 నిబంధనలను తేలికగా తీసుకున్నందుకు పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు తగిన మూల్యం చెల్లిస్తోంది. సోమవారం మరో ముగ్గురు ఆటగాళ్లకు కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలడంతో ఇప్పటివరకు కొవిడ్‌ బారిన పడిన పాక్‌ క్రికెటర్ల సంఖ్య పదికి చేరింది. మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడేందుకు గతనెల 24న పాక్‌ ఆటగాళ్ల బృందం న్యూజిలాండ్‌ వెళ్లింది. ఆటగాళ్లు క్వారంటైన్‌ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారం ప్రవర్తించడంతో కరోనా వ్యాప్తి చెందింది. పాక్‌ క్రికెటర్ల వ్యవహారశైలిపై కివీస్‌ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. ఇక.. షెడ్యూల్‌ ప్రకారం ఇరుజట్ల మధ్య ఈనెల 10 నుంచి వామప్‌ మ్యాచ్‌లు, 18 నుంచి టీ20 సిరీస్‌ ఆరంభం కావాలి.

Updated Date - 2020-12-02T09:07:30+05:30 IST