సంగారెడ్డిలో మరో వ్యక్తికి కరోనా

ABN , First Publish Date - 2020-07-12T00:47:18+05:30 IST

సంగారెడ్డిలో మరో వ్యక్తికి కరోనా

సంగారెడ్డిలో మరో వ్యక్తికి కరోనా

సంగారెడ్డి: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో 55 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు చెప్పారు. కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ లో ఉంచినట్లు అధికారులు చెప్పారు. కరోనా వచ్చిన వ్యక్తి ఉంటున్న ప్రదేశాన్ని అధికారులు శానిటేషన్ చేశారు.

Updated Date - 2020-07-12T00:47:18+05:30 IST