షాద్నగర్లో యువకుడికి కరోనా
ABN , First Publish Date - 2020-05-23T09:06:49+05:30 IST
షాద్నగర్ పట్టణానికి చెందిన ఓ 23 ఏళ్ల యువకునికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు తెలిపారు. ఇటీవల వికారాబాద్ జిల్లా నవాబ్పేట
షాద్నగర్: షాద్నగర్ పట్టణానికి చెందిన ఓ 23 ఏళ్ల యువకునికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు తెలిపారు. ఇటీవల వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలోని కుల్కచర్లలో ఓ విందుకు వెళ్లి వచ్చాడని బాధితుని బంధువులు తెలిపారు. గురువారం యువకుడు అస్వస్థతకు గురికాగా పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడని, అక్కడి వైద్యులు కరోనాగా అనుమానించి చికిత్స అందించలేదని తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న వైద్యశాఖకు చెందిన ర్యాపిడ్ యాక్షన్ టీమ్ ఇన్చార్జి జే.శ్రీనివాసులు యువకుడిని అంబులెన్స్లో కింగ్కోఠి ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం సాయంత్రం అతనికి పాజిటివ్ నివేదిక రావడంతో వైద్య సిబ్బందితోపాటు పోలీసులు అతని కుటుంబ సభ్యులను హోమ్ క్వారంటైన్ చేశారు. అదేవిధంగా యువకుడు ఇంకా ఎవరెవరిని కలిశాడనే విషయాలపై ఆరా తీస్తున్నారు.