అదే బాటలో భారత్
ABN , First Publish Date - 2020-04-10T07:03:47+05:30 IST
కరోనా కష్టాల నుంచి ఊరట కల్పించేందుకు గతనెలలో ప్రకటించిన రూ.1.75 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీకి అదనంగా..
కరోనా కష్టాల నుంచి ఊరట కల్పించేందుకు గతనెలలో ప్రకటించిన రూ.1.75 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీకి అదనంగా మరో రూ.లక్ష కోట్లకు పైగా విలువైన ఆర్థిక ప్యాకేజీని భారత ప్రభుత్వం త్వరలోనే ప్రకటించవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ తాజా నివేదిక అంటోంది. ఇది జీడీపీలో 0.30-0.35 శాతానికి సమానమని సంస్థ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వడ్డీ రేటు రాయితీ, స్థిరాస్తి రంగానికి ప్రోత్సాహకాలు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరిన్ని మూలధన నిధులు వంటివి ఇందులో ఉండవచ్చు.