కరోనా థర్డ్‌వేవ్ ప్రభావం గురించి ఐఐటీ ఫ్రొఫెసర్ ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2021-09-06T11:42:12+05:30 IST

దేశంలో కరోన సెకెండ్‌వేవ్ కట్టడిలోకి వచ్చినట్టు కనిపిస్తోంది.

కరోనా థర్డ్‌వేవ్ ప్రభావం గురించి ఐఐటీ ఫ్రొఫెసర్ ఏమన్నారంటే...

లక్నో: దేశంలో కరోనా సెకెండ్‌వేవ్ కట్టడిలోకి వచ్చినట్టు కనిపిస్తోంది. ఇంతలోనే థర్డ్‌వేవ్ ముప్పు పొంచివుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ థర్డ్‌వేవ్ వస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఎన్నికేసులు వచ్చే అవకాశాలున్నాయనే విషయాలపై ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ మీడియాకు వివరించారు. కరోనాలోని కొత్త వేరియంట్లు రాకపోతే దేశంలో థర్డ్‌వేవ్ రాబోదని ఆయన తెలిపారు. 


డెల్టా వేరియంట్ ఒక్కటే ఉండి, మరో వేరియంట్ గనుక రాకపోతే మనం కరోనాపై చేస్తున్న పోరాటంలో విజయం సాధించినట్లేనన్నారు. కేరళలో కరోనా విజృంభణ గురించి మణీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ దేశవాప్తంగా కరోనా దాదాపు కట్టడిలోకి వచ్చింది. ఒక్క కేరళలో వైరస్ అదుపులోకి వస్తే, దేశవ్యాప్తంగా కరోనా కట్టడి సాధ్యమయ్యిందని చెప్పుకోవచ్చు. రాబోయే నెల రోజుల్లో కేరళలోనూ కరోనా అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయన్నారు. దేశంలోని 75 శాతం ప్రజలు కరోనాతో పోరాడగలిగే స్థాయిలో ఇమ్యూనిటీని సాధించారు. ఉత్తరప్రదేశ్‌లో కరోనా వైరస్ పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చింది. ఆ రాష్ట్రంలో తీసుకున్న కఠినమైన కట్టడి చర్యల కారణంగా వైరస్ నియంత్రణ సాధ్యమయ్యింది. దేశంలో ముమ్మర వ్యాక్సినేషన్ ద్వారానే కరోనా కట్టడి సాధమన్నారు.

Updated Date - 2021-09-06T11:42:12+05:30 IST