తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా థర్డ్‌ వేవ్‌ కలవరం

ABN , First Publish Date - 2021-08-06T23:56:06+05:30 IST

తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా థర్డ్‌ వేవ్‌ కలవరం సృష్టిస్తోంది. ప్రభుత్వ-ప్రైవేట్

తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా థర్డ్‌ వేవ్‌ కలవరం

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా థర్డ్‌ వేవ్‌ కలవరం సృష్టిస్తోంది. ప్రభుత్వ-ప్రైవేట్ కార్యక్రమాల్లో పోలీసులు భారీ బందోబస్తులు నిర్వహిస్తున్నారు. మాస్కులు ధరించకుండా జనం రోడ్డెక్కుతున్నారు. 11 మంది ఉన్నతాధికారులు, ఇద్దరు మహిళా సీఐలు, ముగ్గురు ఎస్ఐలకు కరోనా సోకింది. ఆరుగురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా వ్యాధి లక్షణాలతో మరికొందరు ఇబ్బంది పడుతున్నారు. రెండు దోసులు వ్యాక్సిన్ తీసుకున్న అధికారులకూ కరోనా సోకింది. మూడు రోజుల్లో గాంధీ ఆస్పత్రికి 30కి పైగా కరోనా కేసులు వచ్చాయి. 


Updated Date - 2021-08-06T23:56:06+05:30 IST