భౌతికదూరంతోనే కరోనా కట్టడి

ABN , First Publish Date - 2020-04-09T09:51:06+05:30 IST

కరోనా వైరస్‌ నియంత్రణ భౌతికదూరం పాటిస్తేనే నిర్మూలించవచ్చని రిమ్స్‌ ఎస్‌ఐలు సుధాకర్‌, హరిప్రసాద్‌లు

భౌతికదూరంతోనే కరోనా కట్టడి

 కడప (క్రైం), ఏప్రిల్‌ 8 : కరోనా వైరస్‌ నియంత్రణ భౌతికదూరం పాటిస్తేనే నిర్మూలించవచ్చని రిమ్స్‌ ఎస్‌ఐలు సుధాకర్‌, హరిప్రసాద్‌లు పేర్కొన్నారు. కడప చలమారెడ్డిపల్లెలో బుధవారం రాత్రి స్థానిక ప్రజలకు కరోనా నియంత్రణపై అవగాహణ సదస్సు నిర్వ హించారు. కరోనా వ్యాప్తించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొత్త వారిని... బయటి నుంచి వచ్చిన వారిని తాకడం మంచిది కాదని, ఎవరైనా శ్వాస తీసుకోవడం కానీ, జలుబు, దగ్గు, జ్వరం వంటివి ఉన్న వారు తక్షణం తమకు సమాచారం అందిస్తే వారికి మెరుగైన వైద్యసేవలు అందించడం జరుగుతుందన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే వారి వివరాలు తెలపాలని కోరారు. అనవసరంగా బయట తిరగడం మంచిది కాదని... వృద్దులు, మహిళలు, పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-09T09:51:06+05:30 IST