‘కరోనా టెస్ట్‌లను విస్తృతంగా చేయాలి’

ABN , First Publish Date - 2020-08-15T09:19:06+05:30 IST

కరోనా టెస్ట్‌లను విస్తృతంగా చేయాలని మేడ్చల్‌ జిల్లా అఖిల పక్ష నాయకులు డిమాండ్‌ చేశారు.

‘కరోనా టెస్ట్‌లను విస్తృతంగా చేయాలి’

ఏఎ్‌సరావునగర్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కరోనా టెస్ట్‌లను విస్తృతంగా చేయాలని మేడ్చల్‌ జిల్లా అఖిల పక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. ఏఎ్‌సరావునగర్‌ డివిజన్‌ కమలానగర్‌లోని సీపీఎం కార్యాలయంలో శుక్రవారం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. సీపీఎం, సీపీఐ, టీడీపీ, టీజేఎస్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  కరోనాను అరికట్టడంలో  ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఈ నెల 17న ఆన్‌లైన్‌ బహిరంగ సభ, 18న ప్రభుత్వ ఆస్పత్రుల సందర్శన, 19న మండల కేంద్రాల్లో అఖిల పక్షం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీపీఎం మేడ్చల్‌ జిల్లా కార్యదర్శి పి.సత్యం, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడ ఐలయ్య, టీడీపీ మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు అశోక్‌కుమార్‌గౌడ్‌, టీజేఎస్‌ మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు మేడ రవి, సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ నాయకులు శివ, బాబు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-15T09:19:06+05:30 IST