ఏపీలో తాజాగా 22 మందికి కరోనా టెస్ట్‌లు చేయగా..

ABN , First Publish Date - 2020-03-28T18:09:16+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు.

ఏపీలో తాజాగా 22 మందికి కరోనా టెస్ట్‌లు చేయగా..

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు. తెలంగాణలో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 59కి పెరిగింది. మరోవైపు ఏపీలోనూ పాజిటివ్‌ కేసులు 13కి చేరాయి. శుక్రవారం నాడు గుంటూరు, విశాఖలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


అయితే.. తాజాగా ఏపీ ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. పరీక్షించిన 22 శాంపిల్స్‌లో అన్నీ నెగిటివ్ వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. ఇంతవరకూ కొత్తగా పాజిటివ్ కేసు నమెదు కాలేదు. ఇప్పటివరకూ నమోదైన 13 కేసుల్లో 10 విదేశాల నుంచి వచ్చిన వాళ్ళే. మిగతా ముగ్గురు వాళ్ళ కుటుంబ సభ్యులు, సన్నిహితులు అని ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది.

Updated Date - 2020-03-28T18:09:16+05:30 IST