కరోనా పరీక్ష చేయించుకోవాలని కోరిన భార్య.. గొంతుకోసుకున్న భర్త

ABN , First Publish Date - 2020-07-06T16:00:40+05:30 IST

కరోనా పరీక్ష చేయించుకుని రావాలని భార్య కోరటంతో భర్త గొంతుకోసుకున్న..

కరోనా పరీక్ష చేయించుకోవాలని కోరిన భార్య.. గొంతుకోసుకున్న భర్త

దుగ్గిరాల(గుంటూరు): కరోనా పరీక్ష చేయించుకుని రావాలని భార్య కోరటంతో భర్త గొంతుకోసుకున్న సంఘటన మండల గ్రామం దుగ్గిరాలలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. చెన్నకేశవనగర్‌కు చెందిన జి. అనూషకు పదేళ్ల క్రితం గుంటూరుకు చెందిన జయంత్‌తో వివాహమైంది. కొంత కాలం మనస్పర్థలతో దూరంగా ఉన్న వీరు ఏడాదిగా దుగ్గిరాలలో కలిసి ఉంటున్నారు. కాగా జయంత్‌ ఇటీవల గుంటూరు వెళ్లి, ఆదివారం సాయంత్రం తిరిగి దుగ్గిరాల వచ్చాడు. పరిస్థితులు బాగోలేదు.. కరోనా పరీక్ష చేయించుకుని ఇంటికి రావాలని కుటుంబసభ్యులు జయంత్‌ను కోరారు. అప్పటికే మద్యం సేవించి ఉన్న జయంత్‌ భార్యతో గొడవపెట్టుకుని, ఇంట్లోకి రానివ్వకపోతే కత్తితో గొంతుకోసుకుంటానంటూ వీరంగంవేశాడు. కుటుంబసభ్యులు వారించటంతో గొంతు దగ్గర స్వల్ప గాయమైంది. అనంతరం అతను బైక్‌పై బయటకు వెళ్లిపోయాడు. భయాందోళనకు గురైన భార్య అనూష స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Updated Date - 2020-07-06T16:00:40+05:30 IST