సింగరేణిలో కరోనా టెన్షన్.. ఓ అధికారి, ఇద్దరు కార్మికులకు పాజిటివ్
ABN , First Publish Date - 2020-07-15T15:30:10+05:30 IST
భూపాలపల్లి సింగరేణి ఏరియాలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ అధికమవుతున్నాయి. దీంతో కార్మికుల్లో టెన్షన్ పెరుగుతోంది. మంగళవారం కరోనా కోరల్లో మరో ఇద్దరు సింగరేణి కార్మికులు చిక్కుకున్నారు.
కాకతీయఖని/భూపాలపల్లి(ఆంధ్రజ్యోతి): భూపాలపల్లి సింగరేణి ఏరియాలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ అధికమవుతున్నాయి. దీంతో కార్మికుల్లో టెన్షన్ పెరుగుతోంది. మంగళవారం కరోనా కోరల్లో మరో ఇద్దరు సింగరేణి కార్మికులు చిక్కుకున్నారు. అలాగే మరో అధికారి సైతం దీని బారిన పడ్డారు. ఏరియాలోని కేటీకే ఒకటో గనిలో పనిచేస్తున్న కార్మికుడు, కేటీకే 5వ గనికి చెందిన కార్మికుడు, జీఎం కార్యాలయంలో ఓ విభాగంలో పనిచేస్తున్న ఏరియా స్థాయి అధికారికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు సింగరేణి వైద్యాధికారి తెలిపారు. దీంతో భూపాలపల్లి ఏరియాలో పనిచేస్తున్న కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.