భీమలాపురం గ్రామంలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-06-06T18:20:25+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి ఆచంట మండలం భీమలాపురం గ్రామంలో కరోనా పాజిటివ్ కలకలం రేపింది.

భీమలాపురం గ్రామంలో కరోనా కలకలం

ఏలూరు: పశ్చిమ గోదావరి ఆచంట మండలం భీమలాపురం గ్రామంలో కరోనా పాజిటివ్ కలకలం రేపింది. తాడేపల్లిగూడెం మున్సిపల్ ఉద్యోగి నాలుగు రోజుల క్రితం గ్రామదేవత జాతరకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా అతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. సదరు ఉద్యోగి స్నేహితులు, బంధువులతో కలసి తిరిగినట్లు గుర్తించారు. దీంతో భీమలాపురంను కంటైన్‌మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. 

Updated Date - 2020-06-06T18:20:25+05:30 IST