కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలి
ABN , First Publish Date - 2020-07-11T09:40:48+05:30 IST
కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ప్రపం చంలోనే దేశం నాలుగవ స్థానంలోకి రావడం దురదృష్టకరని, కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని
మంచిర్యాల కలెక్టరేట్, జూలై 10: కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ప్రపం చంలోనే దేశం నాలుగవ స్థానంలోకి రావడం దురదృష్టకరని, కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు రామడుగు లక్ష్మణ్ తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయ ఆవరణలో ప్లకార్డులతో నిరసన తెలిపిన అనంతరం కలెక్టర్ ఏవో సురేష్కు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మంత్రులకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. పేదలం దరికి ఉచితంగా రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖలీందర్, మేకల దాసు, జోగుల మల్లయ్య, బి. సుదర్శన్, దాగం మల్లేష్, ముష్కె సమ్మయ్య, పాల్గొన్నారు.