దేశంలో మూడు లక్షలకు పైగా కరోనా కేసులు..4వేల మరణాలు
ABN , First Publish Date - 2021-05-14T15:25:48+05:30 IST
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 3,43,144 కరోనా పాజిటివ్ కేసులు నమోదు...
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 3,43,144 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 4000ల మంది మృతి చెందారు. మొత్తం దేశవ్యాప్తంగా 2,40,46,809కు కరోనా కేసులు చేరాయి. కరోనా మహమ్మారి వల్ల 2,62,317 మరణాలు సంభవించాయి. దేశంలో 37,04,893 యాక్టివ్ కేసులు ఉండగా..2,00,79,599 మంది రికవరీ అయినట్లు..శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో తెలిపింది.