కడప జిల్లాలో ఒక్కరోజులోనే 1,100 కరోనా కేసులు నమోదు
ABN , First Publish Date - 2021-05-07T12:56:39+05:30 IST
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తోంది. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి....
కడప : రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తోంది. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కడప జిల్లాలో ఒక్కరోజులోనే 1,100ల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రోజు రోజుకు కరోనా కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. గురువారం ఒక్కరోజే ముగ్గురు కరోనాతో మృతి చెందారు. మృతుల్లో ఉద్యోగులు, జర్నలిస్టులు ఉన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రజలు పలు జాగ్రత్తలు వహించాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు.