కరోనా కట్టడికి 370 కోట్లు విడుదల
ABN , First Publish Date - 2020-04-03T07:41:28+05:30 IST
కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర విపత్తు స్పందన నిధి(ఎ్సడీఆర్ఎఫ్) నుంచి రూ.370.06 కోట్లను విడుదల చేశారు. ఈ మేరకు విపత్తుల నిర్వహణ శాఖ ఇన్చార్జి కార్యదర్శి రాహుల్
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర విపత్తు స్పందన నిధి(ఎ్సడీఆర్ఎఫ్) నుంచి రూ.370.06 కోట్లను విడుదల చేశారు. ఈ మేరకు విపత్తుల నిర్వహణ శాఖ ఇన్చార్జి కార్యదర్శి రాహుల్ బొజ్జా జీవో జారీ చేశారు. బుధవారం ఆర్థిక శాఖ రూ.383.75 కోట్ల నిధులు విడుదల చేస్తూ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్(బీఆర్వో) విడుదల చేసింది. అందులో నుంచే రూ.370.06 కోట్లను వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పేరిట విడుదల చేశారు. ఈ నిధులను వినియోగించి... యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించాలని నిర్దేశించారు. ఇప్పటికే వైద్యఆరోగ్య శాఖకు రూ.100 కోట్లు ఇవ్వగా... తాజాగా రూ.370.06 కోట్లు ఇచ్చారు.