సంగారెడ్డి జిల్లాలో కరోనా కల్లోలం

ABN , First Publish Date - 2020-07-05T23:58:14+05:30 IST

జిల్లాలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. జిల్లాలో ఆదివారం కొత్తగా 5 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 1190 మంది నుంచి కరోనా టెస్టుల

సంగారెడ్డి జిల్లాలో కరోనా కల్లోలం

సంగారెడ్డి: జిల్లాలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. జిల్లాలో ఆదివారం కొత్తగా 5 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 1190 మంది నుంచి కరోనా టెస్టుల కోసం రక్తనమూనాలు వైద్యులు సేకరించారు. మొత్తం 237 పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. ఇందులో 66 యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు చెప్పారు. హోం ఐసోలేషన్ లో 113 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 51 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మహమ్మారితో 7గురు మృతి చెందారు.

Updated Date - 2020-07-05T23:58:14+05:30 IST