కరోనా నిబంధనలను ఉల్లంఘించిన వైసీపీ నేతలు
ABN , First Publish Date - 2020-09-29T18:22:38+05:30 IST
విజయవాడ: కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వానపాముల, వెంట్రప్రగడ గ్రామాల్లో అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.
విజయవాడ: కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వానపాముల, వెంట్రప్రగడ గ్రామాల్లో అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రెండు గ్రామాలను కంటైన్మెంట్ జోన్గా అధికారులు ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘించి రెండు గ్రామాలలో సచివాలయ భవానాల నిర్మాణాలకు ఎమ్మెల్యే అనిల్ కుమార్, ఎంపీ బాలశౌరి భూమి పూజ చేశారు. కరోనా ఉన్న నిబంధనలు ఉల్లంఘించి నాయకులు జన సమీకరణ చేశారు. మండలం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో డ్వాక్రా మహిళలను అధికారులు తరలించారు.