విధి నిర్వహణలో కరోనా జాగ్రత్తలు పాటించాలి
ABN , First Publish Date - 2022-01-22T06:48:56+05:30 IST
రోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విధి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని, బెటాలియన్ అభివృద్ధికి సహకరిం చాలని అడిషనల్ డీజీపీ అభిలాష్ బిస్త్ కోరారు.
సిరిసిల్ల రూరల్, జనవరి 21: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విధి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని, బెటాలియన్ అభివృద్ధికి సహకరిం చాలని అడిషనల్ డీజీపీ అభిలాష్ బిస్త్ కోరారు. సిరిసిల్ల అర్భన్ పరిధిలోని సర్ధాపూర్లోని 17వ పోలీస్ బెటాలియన్ను శుక్రవారం సందర్శించారు. బెటాలియన్లో నిర్మిస్తున్న కంట్రోల్ బిల్డింగ్, బేల్ అర్మ్స్, గ్రౌండ్, ఫైరింగ్ రేంజ్, బుల్లెట్ స్కాచింగ్, వాల్తోపాటు పెట్రోల్ బంక్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం బెటాలియన్ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. కమాండెంట్ సుబ్రమ్మణ్యం మాట్లాడుతూ సలహాలు సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ కృపాకర్, అసిస్టెంట్ కమాండెంట్ పార్థసారధి రెడ్డి, మెడికల్ అఫీసర్ కరుణాకర్, ఏవో శైలజ, ఆర్ఐలు నారాయణ, శంకర్, శ్రీఽధర్, రాజేందర్ పాల్గొన్నారు.