ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-09-25T03:15:24+05:30 IST
ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డికి కరోనా సోకింది. జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో..
అమరావతి: ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డికి కరోనా సోకింది. జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ ఫలితాల్లో విష్ణువర్ధన్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోంఐసోలేషన్లో ఉన్నారు. కాగా తిరుమల డిక్లరేషన్ వివాదంపై బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తనతో పాల్గొన్న బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.