14 రోజుల క్రితం ఆమెకు కరోనా పాజిటివ్.. చికిత్స పొందుతూనే..

ABN , First Publish Date - 2020-06-29T17:07:53+05:30 IST

కరోనాతో మహిళ (55) మృతిచెందిన సంఘటన భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె ఇటీవల చికిత్స కోసం హైదరాబాద్‌ వెళ్లొచ్చింది.

14 రోజుల క్రితం ఆమెకు కరోనా పాజిటివ్.. చికిత్స పొందుతూనే..

కరోనాతో మహిళ మృతి 


మహదేవపూర్‌(ఆంధ్రజ్యోతి): కరోనాతో మహిళ (55) మృతిచెందిన సంఘటన భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె ఇటీవల చికిత్స కోసం  హైదరాబాద్‌ వెళ్లొచ్చింది. అక్కడి డాక్టర్లు కేన్సర్‌తోపాటు కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా చేసి ఇంటికి పంపారు. 14 రోజుల క్రితం పాజిటివ్‌ రిపోర్టు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అందిస్తున్న క్రమంలోనే ఆమె మృతి చెందిందని అంబర్‌పల్లి పీహెచ్‌సీ వైద్యుడు చంద్రశేఖర్‌ తెలిపారు.  

Updated Date - 2020-06-29T17:07:53+05:30 IST