రాజస్థాన్ లో తొలి కరోనా మృతి.... 191 కి చేరిన కేసులు

ABN , First Publish Date - 2020-04-04T17:14:28+05:30 IST

రాజస్థాన్‌లో కరోనా బాధితుల సంఖ్య 191 కి పెరిగింది. వీరిలో 40 మంది తబ్లిగి జమాత్‌కు చెందినవారు వున్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో

రాజస్థాన్ లో తొలి కరోనా మృతి.... 191 కి  చేరిన కేసులు

జైపూర్: రాజస్థాన్‌లో కరోనా బాధితుల సంఖ్య 191 కి పెరిగింది. వీరిలో 40 మంది తబ్లిగి జమాత్‌కు చెందినవారు వున్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ఏర్పాటు చేసిన మార్కజ్‌కు హాజరైన తర్వాత వారు ఇక్కడకు తిరిగి వచ్చారు. తాజాగా కరోనాతో బికనేర్‌లో 65 ఏళ్ల మహిళ మరణించింది. ఈ మహిళ వికలాంగురాలు. ఆమె ఎటువంటి  ప్రయాణం చేయలేదు. ఈరోజు ఉదయం మరో 12  కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా  రాష్ట్రంలో ఇటీవల ముగ్గురు కరోనా పాజిటివ్ రోగులు మరణించారనే  వార్తలు వచ్చాయి. అయితే ఈ ముగ్గురి మరణానికి రాష్ట్ర ప్రభుత్వం వేరే కారణం చెప్పింది. దీని గురించి అదనపు ప్రధాన కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్‌ మాట్లాడుతు ఇటీవల మరణించిన ముగ్గురు వ్యక్తులు ఇతర  వ్యాధులతో బాధపడ్డారని చెప్పారు. 


Updated Date - 2020-04-04T17:14:28+05:30 IST