హైదరాబాద్ నుంచి వచ్చిన యువకుడికి కరోనా.. ఎక్కడున్నాడో గుర్తించి..
ABN , First Publish Date - 2020-07-04T21:22:10+05:30 IST
హైదరాబాద్ నుంచి వచ్చిన యువకుడికి కరో నా పాజిటివ్ నిర్ధారణ అయిందని పీహెచ్సీ వైద్యురాలు లావణ్య తెలిపారు. పొలమూరుకు చెందిన
పెనుమంట్ర (పశ్చిమ గోదావరి జిల్లా): హైదరాబాద్ నుంచి వచ్చిన యువకుడికి కరో నా పాజిటివ్ నిర్ధారణ అయిందని పీహెచ్సీ వైద్యురాలు లావణ్య తెలిపారు. పొలమూరుకు చెందిన యువకుడు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. హైదరాబాద్ నుంచి శుక్రవారం బస్సులో వచ్చాడని, అతడు దిగే సమయానికి కరోనా పాజిటివ్ అని సమాచారం రావడంతో సెల్ టవర్ ఆధారంగా ఆ యువకుడిని గుర్తించి పెనుమంట్ర పీహెచ్సీకి తరలించినట్టు తెలిపారు. యువకుడి వెంట ఉన్న తండ్రిని హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు.
గూడెంలో మరో పాజిటివ్ కేసు
తాడేపల్లిగూడెంలో మరో పాజిటివ్ కేసు నమోదయింది. ఓ రాజకీయ నాయకుడికి కరోనా రాగా అతని నుం చి పనిమనిషి, డ్రైవర్లకు బుధవారం కరోనా సోకిన విషయం విదితమే. తాజాగా శుక్రవారం ఆయన మేనల్లుడికి పాజిటివ్గా తేలింది. ఇప్పటికే ఓ పార్టీ కార్యాలయంలోని వారందరికీ పరీక్షలు నిర్వహించగా రిపోర్టులు రా వాల్సి ఉంది. తాజాగా పీఅండ్టీ కాలనీలో మునిసిపల్ అధికారులు రెడ్ జోన్ ఏర్పాటు చేయగా వైద్య సిబ్బంది సర్వే ముమ్మరం చేశారు.
మహిళ మృతి.. కరోనా పరీక్షలకు తరలింపు
క్వారంటైన్లో ఉండి, ఇంటి కొచ్చిన మహిళ గురువారం రాత్రి మృతి చెందింది. శుక్రవారం ఆమె అంత్య క్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా గమనించిన గ్రామస్థులు క్వారంటైన్ నుంచి వచ్చిన ఆమె కరోనాతో చనిపోయి ఉండవచ్చని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె మృతదేహాన్ని కరోనా నిర్ధారణకు ఆస్పత్రికి తరలించారు.