చొప్పదండి ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2022-01-23T01:59:50+05:30 IST
కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో కొవిడ్ పరీక్ష చేయించుకున్నట్లు శనివారం ఆయన తెలిపారు.
చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో కొవిడ్ పరీక్ష చేయించుకున్నట్లు శనివారం ఆయన తెలిపారు. పాజిటివ్ రావడంతో గంగాధరలోని తన నివాసంలో హోం ఐసోలేషన్కు వెళ్లినట్లు తెలిపారు. తనను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాలని, ప్రజలకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఫోన్ ద్వారా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.
మరోవైపు కరోనా సోకిందని తెలియడంతో ఆందోళనకు గురైన ఒక మహిళ గుండెపోటుకు గురై మృతి చెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన అఫ్జల్ బీ (66) అనే మహిళ జ్వరం, దమ్ముతో శనివారం ఉదయం వేములవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. పాజిటివ్ అని తెలియడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురై గుండెపోటుతో కుప్ప కూలి పోయింది. ఆస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతిచెందింది.