అంబటి రాంబాబుకు కరోనా పాజిటీవ్
ABN , First Publish Date - 2022-01-16T19:28:31+05:30 IST
ఎమ్మెల్యే అంబటి రాంబాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.
గుంటూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. కోవిడ్ దెబ్బకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా, సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం క్వారంటైన్లోకి వెళ్తున్నానని, తనను ఎవ్వరూ డిస్టర్చ్ చేయొద్దని అంబటి రాంబాబు కోరారు.
కాగా శనివారం సత్తెనపల్లిలో గాంధీ బొమ్మ సెంటర్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే అంబటి రాంబాబు పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేసి అక్కడ ఉన్నవారిని ఉత్సాహపరిచారు.