మళ్లీ తీవ్ర రూపం.. తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే..
ABN , First Publish Date - 2020-05-27T01:58:56+05:30 IST
తెలంగాణలో కరోనా మళ్లీ తీవ్రరూపం దాల్చింది. మంగళవారం ఒక్కరోజే 71 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో..
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మళ్లీ తీవ్రరూపం దాల్చింది. మంగళవారం ఒక్కరోజే 71 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో తాజాగా ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకూ 1,991 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా 57 మంది మృతి చెందారు. 650 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మంగళవారం 120 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు 1284 మంది డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలో 38 మందికి, 12 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే విదేశాల నుంచి వచ్చిన నలుగురితో పాటు రంగారెడ్డి జిల్లాలో ఏడుగురికి, మేడ్చల్లో ఆరుగురికి, సూర్యాపేట, వికారాబాద్, నల్గొండ, నారాయణపేటలో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు.