ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2021-11-09T12:26:07+05:30 IST
ఉమ్మడి జిల్లాలో సోమవారం ఎనిమిది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో సోమవారం 4,120మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో
ఖమ్మం: ఉమ్మడి జిల్లాలో సోమవారం ఎనిమిది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో సోమవారం 4,120మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 825 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్ నిర్ధారణైంది. ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో సోమవారం ఎవ్వరూ చేరలేదు. ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 320 బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుతం 13మంది చికిత్స పొందుతుండగా 307 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.