ఏపీలో కొత్తగా 26 కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-04-06T04:37:59+05:30 IST
ఏపీలో కొత్తగా 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ..
అమరావతి: ఏపీలో కొత్తగా 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 252కు చేరినట్లు స్పష్టం చేశారు. సోమవారం కర్నూలు జిల్లాలోనే 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు చెప్పారు. ఢిల్లీ మర్కజ్ వెళ్లొచ్చిన 252 కేసుల్లో 190 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఐదుగురు కరోనా పేషెంట్లు డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు.