ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు ఎన్నంటే..

ABN , First Publish Date - 2020-04-05T00:59:40+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కరోనా పాజిటివ్ కేసులపై తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.

ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు ఎన్నంటే..

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కరోనా పాజిటివ్ కేసులపై తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. శనివారం సాయంత్రం ఆరుగంటల వరకూ మొత్తం 190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ కొత్తగా రాష్ట్రంలో మరో 10 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మీడియా బులెటిన్‌లో పేర్కొంది. కృష్ణా జిల్లాలో 05, గుంటూరులో 03, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకూ ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. 


జిల్లాల వారిగా కేసుల వివరాలివీ..

అనంతపురం-3

చిత్తూరు-10

తూర్పు గోదావరి-11

గుంటూరు-26

కడప- 23

కృష్ణా- 32

కర్నూలు-04

నెల్లూరు-32

ప్రకాశం-19

శ్రీకాకుళం-00

విశాఖపట్నం-15

విజయనగరం-0

పశ్చిమ గోదావరి-15



Updated Date - 2020-04-05T00:59:40+05:30 IST