ఏపీని కమ్మేసిన కరోనా

ABN , First Publish Date - 2020-04-08T03:30:57+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌‌ను కరోనా కబలిస్తోంది. గుంటూరు జిల్లాలో పాజిటివ్ కేసు నిర్ధారించారు. ఇప్పటివరకూ ఏపీలో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకూ..

ఏపీని కమ్మేసిన కరోనా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌ను కరోనా కబలిస్తోంది. గుంటూరు జిల్లాలో పాజిటివ్ కేసు నిర్ధారించారు. ఇప్పటివరకూ ఏపీలో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. కర్నూలులో వైరస్‌తో ఒకరు మృతి చెందారు. గుంటూరు, కర్నూలు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. పూటపూటకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో పదమూడు జిల్లాలకు కరోనా వ్యాపించింది. మరోవైపు గుంటూరులో మరో కరోనా పాజిటివ్ కేసును నిర్ధారించారు. కర్నూలులో వైరస్ బారిన పడి 48 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. అప్రమత్తమైన అధికారులు డోన్‌ను రెడ్ జోన్‌గా ప్రకటించారు. 


Updated Date - 2020-04-08T03:30:57+05:30 IST