భారత్లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-06-06T15:05:33+05:30 IST
ఢిల్లీ: భారత్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో ఇండియా..
ఢిల్లీ: భారత్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో ఇండియా.. ఇటలీని దాటివేయడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో భారత్లో 9887 కేసులు నమోదవగా... 294 మరణాలు నమోదయ్యాయి. దీంతో భారత్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 36వేల 675కి చేరుకుంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 15 వేల 942 కాగా.. లక్షా 14వేల 73 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా.. మొత్తం మరణాల సంఖ్య 6642కు చేరుకుంది.