విస్నూర్‌లో కరోనా పాజిటివ్‌ కేసు

ABN , First Publish Date - 2020-05-21T09:06:59+05:30 IST

జనగామ జిల్లాలో బుధవారం మరో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆరుకేసులు నమోదుకాగా, తాజాగా పాలకుర్తి

విస్నూర్‌లో కరోనా పాజిటివ్‌ కేసు

పాలకుర్తి, మే 20 :  జనగామ జిల్లాలో బుధవారం మరో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆరుకేసులు నమోదుకాగా, తాజాగా పాలకుర్తి మండలంలోని విస్నూర్‌కు చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌ అని తేలడంతో మొత్తం కేసుల సంఖ్య 7కు చేరింది. మహారాష్ట్రలోని ముం బాయిలో తాపిమేస్ర్తీగా పని చేస్తున్న విస్నూర్‌వాసి ఈనెల 14న గ్రామానికి వచ్చాడు. సదరు కూలీ అస్వస్థతకు గురికావడంతో అధికారులు హోం క్వారంటైన్‌ చేసి, మూడురోజుల తర్వాత జిల్లా కేంద్రంలోని ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించారు.


కరోనా వైరస్‌ లక్షణాలు ఉండడం తో ఇటీవల ఆ కూలీ నుంచి రక్తనమూనాలు సేకరించి, పరీక్ష కోసం హైదరా బాద్‌కు పంపారు. బుధవారం రాత్రి పాజిటివ్‌ రిపోర్టు రావడంతో హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి ఆస్పత్రికి సదరు కూలీని  వైద్యులు తరలిం చారు. ఈ నేపథ్యంలో విస్నూర్‌ గ్రామాన్ని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కరోనా వైరస్‌ విస్తరించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. సానిటైజేషన్‌ చేస్తున్నారు. కాగా, మహారాష్ట్ర లింక్‌లతో కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో అశోక్‌కుమారు సూచించారు.

Updated Date - 2020-05-21T09:06:59+05:30 IST