కడపలో కరోనా కలకలం.. సన్నిహితంగా 75 మంది!
ABN , First Publish Date - 2020-03-28T16:14:54+05:30 IST
కడప: కడప జిల్లా జమ్మలమడుగులో కరోనా వైరస్ కలకలం రేపింది. జమ్మలమడుగు సరిహద్దు ప్రాంతమైన కర్నూలు జిల్లా ..
కడప: కడప జిల్లా జమ్మలమడుగులో కరోనా వైరస్ కలకలం రేపింది. జిల్లాలోని జమ్మలమడుగు సరిహద్దు ప్రాంతమైన కర్నూలు జిల్లా నొస్సం గ్రామంలో రాజస్థాన్కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. సదరు పాజిటివ్ వ్యక్తితో 75 మంది సన్నిహితంగా మెలిగినట్టు అధికారులు గుర్తించారు. వీరిలో 20 మందిని గుర్తించి ప్రొద్దుటూరు ఐసోలేషన్ హోంకు తరలించారు. మిగిలిన వారి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.