భువనగిరిలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు

ABN , First Publish Date - 2020-06-07T02:05:36+05:30 IST

భువనగిరిలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు నమోదయింది. మే 31న ఢిల్లీ నుంచి ఓ యువకుడు భువనగిరికి వచ్చాడు. అతడిలో వ్యాది లక్షణాలు బయపడడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

భువనగిరిలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు

యాదాద్రి: భువనగిరిలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. మే 31న ఢిల్లీ నుంచి ఓ యువకుడు భువనగిరికి వచ్చాడు. అతడిలో వ్యాది లక్షణాలు బయపడడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. యువకుడితో కాంటాక్ట్‌ అయిన 9 మంది గుర్తించారు. వీరిని బీబీనగర్ ఎయిమ్స్‌లోని ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. రాష్ట్రాన్ని కరోనా వణికిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా మాత్రం కరోనా ఫ్రీ జిల్లాగా ఉండేది. అయితే జిల్లాలో మే 31న మొదటి కేసు నమోదయింది. చౌటుప్పల్‌ మండలం ఎస్‌.లింగోటం గ్రామానికి చెందిన దంపతులు ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేయగా, భర్త మృతి చెందాడు. అప్పటినుంచి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.

Updated Date - 2020-06-07T02:05:36+05:30 IST