కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందించాలి
ABN , First Publish Date - 2022-01-19T06:13:38+05:30 IST
కరోనా బారిన పడ్డ రోగులకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
- ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్బాబు
మంథని, జనవరి 18: కరోనా బారిన పడ్డ రోగులకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరిస్థితిపై మంగళవారం డాక్టర్లు, వైద్య సిబ్బందితో శ్రీధర్బాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుంచి కరోనా నియంత్రణ చర్యల పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. 100 శాతం వ్యాక్సినేషన్ అయ్యేలా చూడా లన్నారు. కోవిడ్ టెస్టింగ్ కేంద్రాలు ఎక్కవ సంఖ్యలో ఏర్పాటు చేయాల న్నారు. గ్రామాల్లో ప్రజలకు నిరం తరం వైద్య సిబ్బంది అందుబాటులో ఉండలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డిజిటల్ ఏక్స్రే మిష న్ రోగులు సద్వినియోగం చేసుకోవా లని సూచించారు.