మానవత్వమా నీవెక్కడ?

ABN , First Publish Date - 2020-07-12T01:56:55+05:30 IST

ప్రస్తుతం మనిషికి సాయం అన్న మాటనే మనిషి మర్చిపోతున్నాడు. ఆఖరికి చనిపోయిన ...

మానవత్వమా నీవెక్కడ?

ప్రస్తుతం మనిషికి  సాయం అన్న మాటనే మనిషి మర్చిపోతున్నాడు. ఆఖరికి చనిపోయిన వారి అంతిమ సంస్కారాల్లోనూ సంస్కారహీనమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.  కరోనా విజృంభిస్తోన్న వేళ మానవత్వం మంటగలుస్తోంది. చివరకు కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే సమయంలోనూ పలుచోట్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది. నెల్లూరు జిల్లా పెన్నా తీరంలో ఇలాంటి ఘటనే జరిగింది. మృతదేహాలను వ్యానులో నుంచి కిందకు దించి వాటిని జేసీబీలోకి విసిరేశారు. తర్వాత జేసీబీ సాయంతో గోతిలోకి విసిరేశారు. ఈ సీన్ మొత్తాన్ని స్థానికులు వీడియో తీశారు. ఆ వెంటనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అమానుషం బయట పడింది. నది ఒడ్డున ఖననం చేయడం దుమారం రేపుతోంది. 


Updated Date - 2020-07-12T01:56:55+05:30 IST