వార్డులో క‌రోనా బాధితురాలు బందీ... ప‌క్క‌న కుక్క కూడా!

ABN , First Publish Date - 2020-07-11T17:29:14+05:30 IST

దేశ‌వ్యాప్తంగా క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఈ నేప‌ధ్యంలో ప‌లు ఆసుప‌త్రుల‌లో వైద్య సిబ్బంది నిర్ల‌క్ష్యం, అర‌కొర వైద్య స‌దుపాయాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇలాంటి ఒక ఉదంతం గుజరాత్‌లోని...

వార్డులో క‌రోనా బాధితురాలు బందీ... ప‌క్క‌న కుక్క కూడా!

మోర్బి: దేశ‌వ్యాప్తంగా క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఈ నేప‌ధ్యంలో ప‌లు ఆసుప‌త్రుల‌లో వైద్య సిబ్బంది నిర్ల‌క్ష్యం, అర‌కొర వైద్య స‌దుపాయాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇలాంటి ఒక ఉదంతం గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో వెలుగు చూసింది. వాంకనేర్ ప్రాంతంలో ఉన్న‌ ఒక ఆసుపత్రిలో ఒక కరోనా బాధితురాలిని కోవిడ్ -19 వార్డులో ఉంచారు. త‌రువాత ఆసుప‌త్రి సిబ్బంది ఆ వార్డుకు లాక్ చేసి, అదృశ్యమయ్యారు. అయితే ఆ వార్డులో ఒక కుక్క ఉన్న సంగ‌తిని కూడా వైద్య సిబ్బంది విస్మ‌రించారు. ఈ ఉదంతానికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఆ బాధితురాలు వార్డులోని కుక్క‌ను చూసి, గ‌ట్టిగా అర‌చిన‌ప్ప‌టికీ, వైద్య సిబ్బంది ప‌ట్టించుకోలేద‌నే ఆరోపణ‌లు ఉన్నాయి. బాధితురాలు ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఈ విష‌యాల‌ను వెల్ల‌డించింది. ఈ ఘ‌ట‌న జూలై 7 న ఆసుపత్రిలో చోటుచేసుకుంది. అయితే ఈ విష‌య‌మైన అధికారికంగా ఎటువంటి ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డం విశేషం. 

Updated Date - 2020-07-11T17:29:14+05:30 IST