ఆస్పత్రి నుంచి పారిపోయిన కరోనా పేషెంట్.. మరుసటి రోజే పొదల్లో శవం!

ABN , First Publish Date - 2020-07-28T02:16:48+05:30 IST

ఆస్పత్రి నుంచి పారిపోయాడో కరోనా పేషెంట్. ఆ తర్వాతి రోజే ఆస్పత్రికి కొంచెం దూరంలోని పొదల్లో అతని శవం కనిపించింది.

ఆస్పత్రి నుంచి పారిపోయిన కరోనా పేషెంట్.. మరుసటి రోజే పొదల్లో శవం!

ప్రయాగ్‌రాజ్: ఆస్పత్రి నుంచి పారిపోయాడో కరోనా పేషెంట్. ఆ తర్వాతి రోజే ఆస్పత్రికి కొంచెం దూరంలోని పొదల్లో అతని శవం కనిపించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగింది. 55ఏళ్ల ఓ కరోనా పేషెంట్ ఆస్పత్రి నుంచి శనివారం పారిపోయాడు. ఆ మరుసటి రోజే ఆస్పత్రికి అరకిలోమీటరు దూరంలోని పొదల్లో అతని శవం కనిపించింది. సదరు పేషెంట్ కొవిడ్19 వార్డు నుంచి బయటకు వెళ్లడం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆస్పత్రిలో తనను ఎవరూ పట్టించుకోకపోవడం వల్లనే ఆ పేషెంట్ పారిపోయినట్లు అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-07-28T02:16:48+05:30 IST