మూడ్రోజులు చికిత్స కోసం ఎదురు చూసి.. కరోనా పేషెంట్ మృతి..

ABN , First Publish Date - 2020-07-09T05:00:15+05:30 IST

ఓ వ్యక్తికి కరోనా అని తెలిసినా అతన్ని ఏ ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకోలేదు.

మూడ్రోజులు చికిత్స కోసం ఎదురు చూసి.. కరోనా పేషెంట్ మృతి..

బెంగళూరు: ఓ వ్యక్తికి కరోనా అని తెలిసినా అతన్ని ఏ ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకోలేదు. ఫలితంగా అతను కన్నుమూశాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. స్థానికంగా నివశించే ఓ 48ఏళ్ల వ్యక్తి కరోనాతో మరణించాడు. అతన్ని ఏ ఆస్పత్రీ అడ్మిట్ చేసుకోలేదని, బెడ్లు లేవంటూ అతనికి చికిత్స తన భర్తకు ఎవరూ చికిత్స అందించలేదని మృతుడి భార్య ఆరోపించింది. ‘మూడ్రోజులుగా నా భర్త కరోనాతో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా ఆయన్ను చేర్చుకోలేదు. బెడ్లు లేవని చెప్పారు. కనీసం ఆక్సిజన్ సౌకర్యం ఉన్న అంబులెన్సు కూడా ఏర్పాటు చేయలేదు’ అని ఆమె వాపోయింది. దీనిపై ఆకాష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ.. తమ తరఫున ఎటువంటి ఆలస్యమూ జరగలేదని, మరణించిన వ్యక్తి మృతదేహాన్ని బీబీఎంపీ అధికారులకు అప్పగించామని తెలియజేశారు.

Updated Date - 2020-07-09T05:00:15+05:30 IST