రోడ్డు ప్రమాదంలో కరోనా బాధితుడు మృతి

ABN , First Publish Date - 2020-08-15T03:58:36+05:30 IST

ప్రకాశం జిల్లా ఒంగోలు జీజీహెచ్ నుంచి పరారైన కరోనా పాజిటివ్ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో కరోనా బాధితుడు మృతి

ఒంగోలు : ప్రకాశం జిల్లా ఒంగోలు జీజీహెచ్ నుంచి పరారైన కరోనా పాజిటివ్ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గురువారం నాడు జీజీహెచ్ ఐసోలేషన్ నుంచి ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. వీరిలో ఇద్దరిని రాచర్లకు చెందిన వారిగా గుర్తించిన అధికారులు తిరిగి ఐసోలేషన్‌కు తరలించారు. ఆ ముగ్గురిలోని ఒకరు ఇవాళ ఒంగోలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వార్డు నంబర్-215లో చికిత్స పొందుతున్న చీమకుర్తికి చెందిన ఏ.శ్రీనివాసరావుగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Updated Date - 2020-08-15T03:58:36+05:30 IST