ఎయిర్పోర్ట్ నుంచి కరోనా ప్రయాణికురాలు పరారీ
ABN , First Publish Date - 2021-12-03T22:56:53+05:30 IST
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కరోనా సోకిన ప్రయాణికురాలు
కుత్బుల్లాపూర్: శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కరోనా సోకిన ప్రయాణికురాలు పరార్ అయింది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికురాలికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో టెస్ట్ చేయడంతో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అయితే ఆమెను ఆస్పత్రికి తరలించేలోపు ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణికురాలు పరారైంది. దీంతో పాస్పోర్ట్ ఆధారంగా ప్రయాణికురాలి చిరునామాను గుర్తించి జీడిమెట్ల పోలీసులకు ఎయిర్పోర్ట్ వర్గాలు సమాచారం అందించాయి. వైద్యశాఖ అధికారులతో కలిసి పోలీసులు ఆమె ఇంటికి వెళ్లగా ఇంటి నుంచి కూడా ఆమె పరారైంది. చివరకు కుత్బుల్లాపూర్లో ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకుని టిమ్స్ ఆస్పత్రికి అధికారులు తరలించారు. ఆమె తల్లిదండ్రులను కూడా ఐసొలేషన్కు అధికారులు తరలించారు. ఈ సంఘటన కొంతసేపు వైద్యాధికారులను హైరానా పడేటట్లు చేసింది.