కరోనాతో కుటుంబంలో ముగ్గురి మృతి
ABN , First Publish Date - 2021-05-14T15:02:48+05:30 IST
కొవిడ్ కారణంగా..
తిరువూరు: కొవిడ్ కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రెండు రోజుల వ్యవధిలో మృతిచెందిన సంఘటన మండలంలోని మల్లేల గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం ఆ కుటుంబానికి చెందిన నారాయణపురపు మంగతాయారు (80) బుధవారం రాత్రి మృతిచెందగా, కొడుకు శ్రీనివాసరావు (45) ఖమ్మంలో చికిత్స పొందుతూ హైదరాబాద్ తరలిస్తుండగా మృతిచెందగా మృతదేహన్ని మల్లేలకు తరలించారు. ఇంటివద్దే మృతదేహాలు ఉండటం, వారి ని ఖననం చేసేందుకు ఎవరూ లేకపోవడంతో గ్రామ మాజీ సర్పంచ్ కలకొండ రవికుమార్ పట్టణానికి చెందిన ఆదియూత్ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అంత్యక్రియాలు నిర్వహించారు. మృతురాలి భర్త నారాయణపురపు కనకయ్య (90) రెండు రోజుల క్రితం కొవిడ్తో విజయవాడలో చికిత్స పొందతూ మృతి చెందాడు. మృతుడు శ్రీనివాస్ కు భార్య ఇద్దరు పిల్లలు. రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.