ములుగు జిల్లాలో 300 దాటిన యాక్టివ్‌ కేసులు

ABN , First Publish Date - 2022-01-21T05:57:21+05:30 IST

ములుగు జిల్లాలో 300 దాటిన యాక్టివ్‌ కేసులు

ములుగు జిల్లాలో 300 దాటిన యాక్టివ్‌ కేసులు

ములుగు, జనవరి 20: జిల్లాలో రోజూవారి కరోనా కేసుల పెరుగుదల కొనసాగు తోంది. గురువారం కొత్తగా  54మం దికి కొవిడ్‌ సోకింది. దీంతో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 333కు పెరగగా మొత్తం కేసుల సంఖ్య 15,634కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి ఇంటింటి  జ్వర సర్వే మళ్లీ జరి పేందుకు యంత్రాంగం సిద్దమైంది. ప్రస్తు తం చాలా మంది జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో బాధపడుతుండగా పరీక్షలు నిర్వహిస్తే మరిన్ని ఎక్కువ కేసులు వెలుగుచూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  గురువారం 2,282 మందికి వ్యాక్సిన్‌ వేశారు. ఇందులో 493 మందికి మొదటి డోసు, 1,691 మందికి రెండో డోసు, 98 మందికి బూస్టర్‌ డోసు వేశారు.

Updated Date - 2022-01-21T05:57:21+05:30 IST